Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో 1,000 “మీ మార్ట్స్” ఏర్పాటుకు ఒప్పందం

న్యూఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఐఏఎస్ మరియు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) మేనేజింగ్ డైరెక్టర్  అనీస్ జోసెఫ్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 1,000 “మీ మార్ట్స్” ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

ఈ కార్యక్రమాన్ని తొలి దశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న రేషన్ షాప్లు (ఫెయిర్ ప్రైస్ షాపులు) ద్వారా ప్రజలకు దాదాపు 70 రకాల నాణ్యత హామీ కలిగిన వినియోగ వస్తువులను పోటీ ధరలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజలకు ఒకే చోట నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకు లభించడంతో పాటు, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *