అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో విజయవంతంగా నిర్వహించబడుతున్న జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఎదురుగా భావ ఆయుర్వేద హాస్పిటల్ మూడవ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం 1.08.2026 శనివారం ఉ॥10 గం॥ నుండి 1.00 గం|| వరకు ఏంతో ఘనంగా జరిగింది. ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంను ఆశ్రమ నివాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు , శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు, శ్రీమాన్ మధుసూధనా చార్యులు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందులు అందించారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీమాన్ శరత్ రాజ్, డాక్టర్ దేవయాని వచ్చిన పేషెంట్స్ అందర్నీ పరీక్షించి వారికీ అవసరం అయిన మందులను అందించారు.
Prajavartha Online Telugu News