విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మండలి వెంకటకృష్ణారావు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మాజీ మంత్రి, ప్రముఖ ప్రజానాయకుడు, తెలుగు భాషా–సంస్కృతి పరిరక్షకుడు మండలి వెంకటకృష్ణారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మండలి వెంకటకృష్ణారావు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం పనిచేసిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. విద్యా వికాసం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, తెలుగు భాషా మరియు సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పరిపాలనలో విలువలు, ప్రజల పట్ల అంకితభావం, నిస్వార్థ సేవ ఆయన జీవితానికి ప్రతీకలని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News