-53వ PRAGATI సమావేశంలో రాష్ట్ర చర్యలను వివరించిన చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత ఆధారిత సమగ్ర చర్యలు చేపడుతోందని చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ తెలిపారు. సైబర్ నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు, నేరాలు జరగకముందే గుర్తించి నివారించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డా. పి.కె. మిశ్రా అధ్యక్షతన గురువారం జరిగిన 53వ PRAGATI సమావేశంలో రాష్ట్రంలో చేపడుతున్న సైబర్ నేర నియంత్రణ చర్యలను చీఫ్ సెక్రటరీ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఏపీ సచివాలయం నుంచి EAGLE IGP ఆకే రవి కృష్ణ, SP అధిరాజ్ సింగ్ పాల్గొన్నారు.
S4C, e-Zero FIR అమలు
14C మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో సైబర్ నేరాల సమన్వయం కోసం State Cyber Coordination Centre (S4C) ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు.
NCRP, 1930 హెల్ప్లైన్ ద్వారా వచ్చే సైబర్ నేర ఫిర్యాదులపై వేగంగా FIR నమోదు చేసేందుకు e-Zero FIR విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు CIDలోని Cyber Crime Police Stationను రాష్ట్ర Designated Police Stationగా నియమించినట్లు వివరించారు. e-Zero FIRను CCTNSతో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
MRM ద్వారా రూ.1.56 కోట్ల నగదు పునరుద్ధరణ
సైబర్ ఆర్థిక మోసాల బాధితులకు నగదు పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు Money Restoration Module (MRM) ను మే 2026లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినట్లు తెలిపారు.
గత మూడు మాసాల్లో MRM ద్వారా రూ.1.56 కోట్లను బాధితులకు తిరిగి అందించినట్లు చీఫ్ సెక్రటరీ వెల్లడించారు.
GRM ద్వారా 358 ఫిర్యాదుల పరిష్కారం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో Grievance Redressal Mechanism (GRM) Portal అమల్లో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 358 ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు.
అక్రమ ఆన్లైన్ కంటెంట్పై చర్యలు
Sahyog Portal ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 2,713 Request IDsకు సంబంధించిన 23,181 అక్రమ URLలపై చర్యలు చేపట్టగా, సంబంధిత ఇంటర్మీడియరీల ద్వారా 20,926 URLలను తొలగించడం లేదా డిసేబుల్ చేయడం జరిగిందని తెలిపారు.
అంతర్రాష్ట్ర సైబర్ నేరాలపై సమన్వయం
Samanvaya Portal ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 4,378 CIARsలో 2,609 పరిష్కరించగా, రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు పంపిన 2,959 CIARsలో 2,351 పరిష్కరించినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు.
అదే కాలంలో Samanvaya Portalలో 57 కేసులు, 103 నిందితుల ప్రొఫైల్స్, 1,294 అంతర్రాష్ట్ర లింకేజీలను నమోదు చేసినట్లు వెల్లడించారు.
Cybercrime Hotspotsపై ప్రత్యేక దృష్టి
Pratibimb Module ద్వారా ATM ఉపసంహరణలు, Mule Accounts, అనుమానాస్పద మొబైల్ నంబర్లు తదితర వివరాలను విశ్లేషించి సైబర్ నేర హాట్స్పాట్లను గుర్తిస్తున్నట్లు తెలిపారు.
గత ఐదు మాసాల కాల వ్యవధిలో 553 ATM IDs, 16 జిల్లాలు, 3,019 NCRP acknowledgements, రూ.6.85 కోట్ల లావాదేవీలను విశ్లేషించినట్లు తెలిపారు. అలాగే గత ఏడాది జూన్ నుండి డిసెంబర్ వరకు 1,848 Mule Accounts, ఈ ఏడాది జనవరి నుండి మే వరకు 934 Mule Accounts, 335 అనుమానాస్పద మొబైల్ నంబర్లు గుర్తించి తదుపరి చర్యల కోసం సంబంధిత జిల్లాలకు పంపినట్లు వివరించారు.
500 మంది Cyber Commandosకు శిక్షణ లక్ష్యం
సైబర్ నేరాల దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు 13 మంది పోలీసు సిబ్బందికి Cyber Commando శిక్షణ అందించామని, మరో 60 మందికి పైగా శిక్షణకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొత్తం 500 మంది Cyber Commandosకు శిక్షణ ఇవ్వడమే రాష్ట్ర లక్ష్యమని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. CyTrain Portal ద్వారా సైబర్ దర్యాప్తు, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ ఇంటెలిజెన్స్ తదితర అంశాల్లో నిరంతర శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
89,260 సైబర్ అవగాహన కార్యక్రమాలు
సైబర్ మోసాల నివారణలో ప్రజల అప్రమత్తత కీలకమని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత Information, Education and Communication (IEC) కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 89,260 సైబర్ నేర అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు.
సైబర్ నేరాల నియంత్రణలో “నేరం జరిగిన తర్వాత స్పందన” నుంచి “నేరం జరగకముందే నివారణ” దిశగా రాష్ట్ర వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, సాంకేతికత, డేటా విశ్లేషణ, అంతర్రాష్ట్ర సమన్వయం, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం, నగదు పునరుద్ధరణ, పోలీసు సిబ్బంది సామర్థ్యాభివృద్ధి, ప్రజా అవగాహన ద్వారా సైబర్ నేరాలపై సమగ్రంగా పోరాడుతున్నామని చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ తెలిపారు.
Prajavartha Online Telugu News