అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తోతపూరి మామిడి రైతులను తప్పుదోవ పట్టిస్తూ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్గాలు, కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు చేస్తున్న విష ప్రచారాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనుగోళ్లు, పల్ప్ పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల్లో అసత్యాలు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రైతుల్లో అయోమయం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో …
Read More »All News
జూన్ 18, 19 తేదీల్లో పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సమీక్ష సమావేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా రంగ సంస్థల కమిటీ (Committee on Public Undertakings) సమావేశాలు ఈ నెల 18 మరియు 19 తేదీలలో అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయ కమిటీ హాల్-1 లో నిర్వహించనున్నట్లు శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సమావేశంలో సంబంధిత అథారిటీలు, కార్పొరేషన్ల స్థాపన లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితి, ఆస్తులు–అప్పులు, సంస్థల కార్యకలాపాలు, సాధించిన విజయాలు, సిబ్బంది వివరాలు, ఖాళీలు, రోస్టర్ అమలు …
Read More »నాలుగు రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు సమక్రమమే : రిటర్నింగ్ అధికారి వణితా రాణి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ ఎంపి ఎన్నికలకు సంబంధించి నలుగురు అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వణితా రాణి వెల్లడించారు.మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది.రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా తెలుగుదేశం పార్టీ తరుపున చింతకాయల విజయ్,బాష్యం రామకృష్ణ,సానా సతీష్,జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ లు దాఖలు చేసిన నామినేష్లను సమక్రమంగా ఉండడంతో పరిశీలన అనంతరం నలుగురు అభ్యర్దుల నామినేషన్లను ఆమోదించినట్టు ఆమె వెల్లడించారు. …
Read More »రొయ్యల రైతుల సంక్షేమం, ఆక్వాకల్చర్ రంగాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
– ఫీడ్ ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారంతో ముందుకు రావాలి – అదనంగా 12 వేల ఆక్వాకల్చర్ విద్యుత్ కనెక్షన్లకు యూనిట్కు రూ.1.50 రాయితీ – ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రొయ్యల రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, …
Read More »రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
-10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి -ఎన్డీఎ, నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొననున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి …
Read More »సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరన
-సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ఆప్కాబ్ చైర్పర్సన్ గన్ని వీరాంజనేయులు, ఎండీ ఆర్.వి. రామకృష్ణ, నాబార్డ్ డిజిఎం ఎం.ఎస్.ఆర్. చంద్ర మూర్తి తదితరులు సభలో ప్రసంగిస్తున్న ఆప్కాబ్ చైర్పర్సన్ గన్ని -‘సహకారభూమి’ మనుగడకు సంపూర్ణంగా సహకరిస్తాం -సహకార వ్యవస్థకు ఓ దిక్సూచి ఈ పత్రిక -ఆప్కాబ్ చైర్మన్ గన్ని, ఎండీ రామకృష్ణ భరోసా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగం విలువలు, విశిష్టత, సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిస్వార్థంగా కృషిచేస్తున్న ‘సహకారభూమి’ పక్షపత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ …
Read More »ప్రోస్తటిక్ హ్యాండ్ కి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఏదో కారణం వల్ల చేయి పోగొట్టుకున్న వారికి తమ చేతితో పాటు వారి జీవనాధారం కూడా పోగొట్టుకోవడం చాలా విచారకరమైన విషయం. పేద కుటుంబాల వారు సొంతంగా కృత్రిమ చేయి పెట్టుకోలేరు. వారికి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉచితంగా పనికి ఉపయోగపడే విధంగా ఉండే కృత్రిమ చేయిని అందజేయనున్నారు” అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా IAS పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల …
Read More »హజ్ యాత్రికులకు విశిష్ట సేవలు అందించిన ఇన్స్పెక్టర్లకు సన్మానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా యాత్రికులకు విశిష్ట సేవలు అందించిన హజ్ ఇన్స్పెక్టర్లు రబ్బానీ, ఉస్మాన్ భాషలను ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఘనంగా సన్మానించింది. విజయవాడ హజ్ కమిటీ కార్యాలయంలో జరిగిన అభినందన సభ లో కమిటీ చైర్మన్ హసన్ భాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు రాష్ట్ర హజ్ కమిటీ ఈవో గౌస్ పీరా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హసన్ భాష మాట్లాడుతూ, కేంద్ర హజ్ కమిటీ పారదర్శక విధానంలో ఎంపిక చేసిన రబ్బానీ, …
Read More »దోష రహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా సర్..
– ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకర ఓటర్ల జాబితా కీలకం – ప్రక్రియలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోల పాత్ర ముఖ్యం – సర్ స్ఫూర్తికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది నిబద్ధతతో సేవలందించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు దోష రహిత ఓటర్ల జాబితా కీలకమని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, సిబ్బంది ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. …
Read More »పట్టణాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిదీపాల అభివృద్ధికి ప్రాధాన్యం
-మూడేళ్లలో మౌలిక వసతుల కల్పనకు భారీ ప్రణాళికలు -డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు రూ.29 వేల కోట్ల ప్రణాళిక -మున్సిపాటీల్లో చేసే పనుల్లో ప్రజా ధనం వృదా కాకూడదు -పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. స్థానిక మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో హడ్కో ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు …
Read More »
Prajavartha Online Telugu News