– స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర దిశగా ముందడుగు వేద్దాం – ప్రతిఒక్కరూ జీవనశైలిలో యోగాను భాగం చేసుకోవాలి – పండగలా ఊరూవాడా యోగా శిక్షణ కార్యక్రమాలు – జిల్లాలో అందుబాటులో 10 వేల మంది ట్రైనర్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర-2026లో భాగంగా ప్రజా ఉద్యమంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. స్వర్ణాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ …
Read More »All News
పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరియు ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం
-రాజమహేంద్రవరంలో జరిగిన ఎంవోయూతో విశాఖపట్నంలో 41వ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహణకు మార్గం సుగమం -41వ ఐఏటీఓ వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కు ఎంతో గర్వకారణమని తెలిపిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ ప్రమోషన్ మరియు డెస్టినేషన్ మార్కెటింగ్కు మరింత ఊతం ఇచ్చేలా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నం నగరంలో 2026 సెప్టెంబర్ 10 నుండి 12 వరకు 41వ ఐఏటీఓ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ …
Read More »పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జి, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాలను సందర్శించి పారిశుధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కృష్ణలంకలోని రివర్ ఫ్రంట్ పార్కులో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొని …
Read More »ఏపీయుఎఫ్ఐడీసి ఆధ్వర్యంలో వర్క్షాప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధుల సమర్థవంతమైన వినియోగం మరియు అదనపు రుణాల సమీకరణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీయుఎఫ్ఐడీసి) ఆధ్వర్యంలో విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్లో మంగళవారం నుంచి రెండు రోజుల ఉన్నత స్థాయి వర్క్షాప్ లో గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పాల్గొన్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్.పొంగూరు నారాయణ, హడ్కో సీఎండీ …
Read More »‘యోగాంధ్ర 2026’ కార్యక్రమాలు వేగవంతం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల శారీరక, మానసిక ఉల్లాసం మరియు ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమాలను గుంటూరు నగరంలో మరింత వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా యోగా రంగంలో నిపుణులైన మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఒక్కో సచివాలయంకు 17 మంది చొప్పున …
Read More »“పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ మన అందరి బాధ్యత”
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : “పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ మన అందరి బాధ్యత” అనే నినాదంతో నగరంలో పారిశుద్ధ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం విజయవంతంగా 3వ వారంలోకి అడుగుపెట్టిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే ఈ మూడవ వారపు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో భాగంగా నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రత్యేక రోజువారీ కార్యాచరణ …
Read More »ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
-ఎన్నికల సిబ్బందికి జిల్లా స్థాయి బ్రెయిన్స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలను పూర్తిస్థాయిలో హేతుబద్ధీకరించి, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్రెయిన్స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమంలో కె భాస్కర్ రెడ్డి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ …
Read More »మహిళా ఎంటర్ప్రైజెస్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : CEO కరుణ వాకటి, IAS
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ రోజు గౌరవ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) కరుణ వాకటి, IAS బ్యాంకు లింకేజీ, మహిళా ఎంటర్ప్రైజెస్ (Women Enterprises) మరియు స్త్రీనిధి కార్యక్రమాల ప్రగతిపై సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ CEO మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు Annual Credit Livelihood Plan (ACLP) ప్రకారం రుణాలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు బ్యాంకు …
Read More »హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు, విమర్శలకు ఆస్కారమివ్వొద్దు
– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – విద్యార్థులు వచ్చేనాటికి హాస్టళను, గురుకులాలను శుభ్రం చేయండి – బీసీ బిడ్డల ఉన్నత విద్యే కూటమి లక్ష్యం – రెండు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాల ఏర్పాటు – ఆప్కో, లేపాక్షి షో రూమ్ ల్లో అమ్మకాలు పెంచండి – బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖాధికారుల సమీక్షలో మంత్రి సవిత తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో …
Read More »75 ఏళ్ల వృద్ధాప్యం . . పైగా నిస్సహాయ స్థితి
-దిక్కుతోచని స్థితిలో కలెక్టర్ ను కలిసి ఆశ్రయం కల్పించాలని అభ్యర్థించిన వృద్ధురాలు -వృద్ధురాలి పరిస్థితిని చూసి చలించి బిటిఆర్ కాలనీ రాష్ట్రీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వేంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక రాష్ట్రానికి చెందిన 75 సం. ల వయసు గల శారదమ్మ దిక్కు తోచని స్థితిలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వేంకటేశ్వర్ ను కలసి ఆశ్రయం కల్పించాలని కోరగా వెనువెంటనే మానవతా దృక్పథంతో స్పందించి జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News