-కలెక్టర్ కి ఏఐటియుసి విజ్ఞప్తి -మాచవరం వద్దనున్న మలేరియా కార్యాలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్, పార్కు కార్మికుల జీతాల పెంపుదల కోసం వారికి సంఘీభావంగా 11 రోజులపాటు పారిశుధ్య, ఇంజనీరింగ్, పార్కు కార్మికులు చేసిన సమ్మె కాలానికి జీతాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉన్నదని, నగరపాలక సంస్థ అధికారులు తక్షణం స్పందించి జీతాలు …
Read More »Daily Archives: May 12, 2026
జన గణనను వేగవంతం చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన గణనను వేగవంతం చేయాలని చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం భవానీపురం, నాలుగు స్తంభాల సెంటర్, కబేళా, సితార సెంటర్ ప్రాంతాలన్నీ పర్యటించి ఎన్యుమేరేటర్లు మరియు సూపర్వైజర్లతో చేసే జన గణన ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారితో పాటు స్వయంగా తానే ఒక కుటుంబంతో మాట్లాడి, ప్రశ్నలన్నింటినీ అడిగి, జనగణన ప్రక్రియను పూర్తి చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »ఏపీ చాంబర్స్ అమరావతి, విశాఖపట్నంలో వీఎఫ్ఎస్ గ్లోబల్ వీసా అప్లికేషన్ కేంద్రాల ఏర్పాటు కోరింది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) రాష్ట్రంలో పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణాలు మరియు వీసా సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అమరావతి / రాజధాని ప్రాంతం మరియు విశాఖపట్నంలో పూర్తిస్థాయి వీఎఫ్ఎస్ గ్లోబల్ వీసా అప్లికేషన్ కేంద్రాలు (VACs) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జి. సాయి ప్రసాద్, ఐఏఎస్ గారికి సమర్పించిన ప్రతినిధిత్వంలో, ఏపీ చాంబర్స్ అధ్యక్షులు శ్రీ పొట్లూరి భాస్కరరావు …
Read More »శీ అభయాంజనేయస్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు
దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానం నందు హనుమంతుని జన్మదినోత్స వాన్ని పురస్కరించుకుని హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం ఆలయం నందు అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన తరువాత రెండవ సంవత్సరం హనుమత్ జయంతి అని ఈ దైవ …
Read More »ఘనంగా ‘భారతీయ హిందూ పరిషత్’ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా తరఫున జిల్లావ్యాప్తంగా పలు ఆంజనేయ స్వామి దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ‘భారతీయ హిందూ పరిషత్’ క్రియాశీలక సభ్యులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు హిందూ ప్రముఖులను, దేవాలయాల నిర్వాహకులను సన్మానించి సత్కరించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాలలో తమవంతు సహాయ …
Read More »గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కొక్కిరిగడ్డ నీరజ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరానికి చెందిన కొక్కిరిగడ్డ నీరజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకు అర్హత సాధించాడు. గత ఫిబ్రవరి 2వ తేదీ హైదరాబాద్ లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్లో 22 దేశాల నుంచి 2 వేల మంది కీ బోర్డు వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన నిర్వ హించారు. ఈ ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంతో ఈ ప్రదర్శనలో ప్రతిభ చాటిన 777 మంది విద్యార్థులకు గిన్నిస్ వరల్డ్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి నుంచి జెరుబూబ్బెల్ గిన్నిస్ రికార్డు ధ్రువపత్రం అందుకున్నారు. …
Read More »హనుమాన్ జయంతి సందర్భంగా పోతిన వెంకట మహేష్ ప్రత్యేక పూజలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హనుమాన్ జయంతి సందర్భంగా పోతిన వెంకట మహేష్ పంచముఖ ఆంజనేయ ఆలయం, వీరాంజనేయ స్వామి ఆలయం పలు ఆంజనేయ స్వామి దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ…ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలిపారు. పిల్ల రవి పుట్టినరోజు మరియు హనుమాన్ జయంతి సందర్భంగా రావి చెట్టు సెంటర్ సిద్దిక్ హాస్పిటల్ వద్ద 750 మందికి మజ్జిగ …
Read More »ప్రధాన మంత్రి మోదీ యుఏఈ మరియు యూరప్ బహుళ దేశాల పర్యటనకు ఎఫ్ఐఈఓ స్వాగతం
– భారత వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాలకు భారీ ఊతం లభించనుంది న్యూఢిల్లీ, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2026 మే 15 నుండి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ దేశాలకు చేపట్టనున్న అధికారిక పర్యటనను స్వాగతించింది. ఈ పర్యటన ద్వారా భారతదేశం కీలక గ్లోబల్ భాగస్వామ్య దేశాలతో వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, ప్రస్తుత …
Read More »పెరుగుతున్న ఎండల దృశ్య వి ఎం సి రక్షణ చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున విజయవాడ నగరపాలక సంస్థ ప్రజల కోసం రక్షణ చర్యలు తీసుకుంటుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్డు, అతారత్తయ్య వీధి, సాంబమూర్తి రోడ్డు, కోనాడా సూర్యప్రకాష్ రోడ్డు, గవర్నర్పేట, దుర్గాపురం, గులాబీ తోట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని …
Read More »ఎయిమ్స్ లో 2026 అగ్నిమాపక భద్రతా వారోత్సవాలు & అవగాహన కార్యక్రమాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిమ్స్ మంగళగిరిలో 2026 మే 4 నుండి 10 వరకు “సురక్షిత ఆసుపత్రి, సురక్షిత రోగి, సురక్షిత సిబ్బంది – అగ్ని ప్రమాదాల నివారణ కోసం అందరం కలిసికట్టుగా” అనే ఇతివృత్తంతో అగ్ని భద్రతా వారోత్సవాలు 2026 నిర్వహించబడ్డాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ అయిన ప్రొఫెసర్ (డా.) అహంతేమ్ శాంతా సింగ్ మరియు డీన్ (అకాడమిక్స్), ప్రొఫెసర్ & హెడ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి అయిన ప్రొఫెసర్ (డా.) దేశు రామ మోహన్ ఆధ్వర్యంలో ఈ …
Read More »
Prajavartha Online Telugu News