Breaking News

Daily Archives: September 19, 2026

ఇప్పటం రోడ్డులో వినాయకునికి 125 ప్రసాదాలు

-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ధనుంజయకు సత్కారం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆత్మకూరులో ఇప్పటం రోడ్డు నాలుగవ లైన్ లో శ్రీ విజయ దుర్గా చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం పక్కన శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి 125 ప్రసాదాలు సమర్పించారు. స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదాలు ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా …

Read More »

విద్యుత్ సంస్థల్లో 62 ఏళ్ల పదవీ విరమణ వయస్సు పెంపును తక్షణమే అమలు చేయాలి…

-ఏపీ పవర్ ఎంప్లాయీస్ ఫోరమ్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎంఎస్.నం.45 ను తక్షణమే అమలు చేయాలని ఏపీ పవర్ ఎంప్లాయీస్ ఫోరమ్ జనరల్ సెక్రటరీ ఎస్. కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నందుకు …

Read More »

సర్వేలను పూర్తి చేసి గుంటూరు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత సర్వేలను వారంలోగా పూర్తి చేసి, గుంటూరు నగర పాలక సంస్థ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ సచివాలయాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డ్ సచివాలయాలకు ప్రత్యేకాదికారులుగా నియమించబడిన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సర్వేలను త్వరితగతిన పూర్తి చేయుటకు తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, …

Read More »

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రతో నగర పారిశుధ్య విధానంలో గుణాత్మక మార్పు… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ (సాసా) కార్యక్రమాల ద్వారా నగర పారిశుధ్య నిర్వహణ విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం సాసా కార్యక్రమంలో భాగంగా జిఎంసి హెడ్ వాటర్ వర్క్స్ నుండి జాతీయ రహదారి వరకు నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌లో కమిషనర్ పాల్గొని, అనంతరం కార్మికులు, స్థానికులు, అధికారులతో కలిసి స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

నిబంధనల మేరకే నూతన పింఛన్ల మంజూరు

-అర్హతల పరిశీలనలో ఎలాంటి ఉల్లంఘనలకు తావివ్వరాదు -అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న పింఛన్లను ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత అర్హతల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు–2 కార్యాలయం నందు శనివారం జిల్లా కలెక్టర్ …

Read More »

సోషల్ మీడియాతో మహిళా ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌

-డిజిటల్ మార్కెటింగ్‌పై మహిళలకు అవగాహన కల్పించాలి -తీసుకోవాల్సిన జాగ్రత్తలు పైనా అప్రమత్తం చేయాలి -డీఆర్డీఏ సిబ్బందికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచన ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేస్తున్న ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ను కల్పించడంతో పాటు, వారిలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను డిజిటల్ మార్కెటింగ్‌ వైపు ప్రోత్సహించేందుకు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని డీఆర్డీఏ సిబ్బందికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైజ్ కేంద్రంలో 100 మంది …

Read More »

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

-పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణంతో ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ కంచికచర్, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో శనివారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా “హరిత ఆంధ్ర – శీతల ఆంధ్ర” అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన …

Read More »

సెప్టెంబర్ 27న ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

– జిల్లా పర్యాటక వైభవాన్ని చాటేందుకు యువతకు ప్రత్యేక అవకాశం – విద్యార్థులు, యువత సృజనాత్మకతకు ప్రత్యేక వేదిక – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లాలో ఘనంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం, జిల్లా కలెక్టరేట్, రాఘవయ్య పార్క్‌లలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిని ప్రోత్సహించడంతో …

Read More »

రాష్ట్రంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్

-విజయవాడలో ఘనంగా మహాకవి బోయి భీమన్న జయంతి ఉత్సవాలు -ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ -అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత భూసురపల్లి వెంకటేశ్వర్లుకు ‘బోయి భీమన్న అవార్డు-2026’ ప్రదానం..రూ. 2 లక్షల పారితోషికం అందజేసిన మంత్రి దుర్గేష్ -అర్హులైన కళాకారులందరికీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే ఐడీ కార్డులు అందిస్తాం -రాజమహేంద్రవరం తెలుగు వర్సిటీకి ‘బోయి భీమన్న కళాపీఠం’ తరలింపుకు చర్యలు -మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో …

Read More »

ఆయుర్వేదం.. ఆరోగ్యానికి అమృతధార

– ఆరోగ్య ఆంధ్ర నిర్మాణానికి ప్రాచీన విజ్ఞాన సంప‌ద‌ – ప్ర‌తిఒక్క‌రూ ఆయుర్వేదం విశిష్ట‌త‌ను గుర్తించాలి – దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి – ఘ‌నంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్స‌వం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుర్వేదం కేవలం ఒక వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సుసంప‌న్న‌, ఆరోగ్య‌, ఆనంద ఆంధ్ర నిర్మాణానికి ఇది …

Read More »