Breaking News

వచ్చే నెల నుంచి అమరావతిలో వేగంగా నిర్మాణ పనులు

-అమరావతి నిర్మాణ పనులతో ఆటోడ్రైవర్లకు పెరగనున్న కిరాయిలు
-అభయ ఆంజనేయ ఆటోస్టాండ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.15 వేల కోట్ల నిధులతో వచ్చే నెల నుంచి అమరావతిలో నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. అమరావతి నిర్మాణ పనులు జరిగితే అక్కడకు పనులు చేయడానికి వెళ్ళే వారితో పాటుగా వివిధ పనులపై అమరావతికి వెళ్ళే వారి సంఖ్య పెరుగుతుందని దాని ద్వారా ఆటో డ్రైవర్లకు కిరాయిలు పెరిగి వారి జీవనోపాధి మెరుగవుతుందన్నారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్‌లో అభయ ఆంజనేయ ఆటోస్టాండ్‌ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆదివారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ చదువులేని వారితో పాటుగా చదువుకున్న వారు కూడా జీవనోపాధి కోసం ఆటోలను నడుపుతున్నారని చెప్పారు. 2014–19 సంవత్సరాల మధ్య టీడీపీ ప్రభుత్వ హాయం ఆటో డ్రైవర్లకు స్వర్ణయగం వంటిందని చెప్పారు. ఆటోడ్రైవర్లు విజయవాడ నగరం నుంచి అమరావతికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ రోజుకు సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలకు పైగానే సంపాదించుకునేవారని అన్నారు. ఆ సమయంలో నగరంలో ఎక్కడా చూసినా ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు కనపడేవి కాదాన్నరు. వైఎస్సార్‌సీపీ పాలనలో నగరంలో ఎక్కడ చూసిన టూలెట్‌ బోర్టులు దర్సనమిచ్చాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడంతో అమరావతిలో పనులు మొదలయ్యాయని అన్నారు. వచ్చే డిసెంబర్‌ నుంచి అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతం అవుతాయన్నారు. అక్కడ పనులు వేగంగా జరుగుతుంటే నగరంలోని ఆటో డ్రైవర్లకు మంచి డిమాండ్‌ ఉంటుందని చెప్పారు. విజయవాడ నగరం నుంచి అమరావతికి వెళ్ళడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. 2014–19 సంవత్సరాల మధ్యకాలంలో మాదిరిగా ఆటోడ్రైవర్ల జీవనోపాధి మెరుగ్గా తయారవుతుందని అన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం రూ.15 వేల కోట్లు మంజూరు చేయడమే కాకుండా అమరావతిలో జరుగుతున్న అభివృద్థిని చూసి ప్రపంచబ్యాంకు నుంచి నిధులు ఇవ్వడానికి వారు కూడా సిద్దంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రాభివృద్థికి కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మనమందరం మద్దతుగా నిలబడాలని అన్నారు.
గాదిరెడ్డి అమ్ములు మాట్లాడుతూ అభయఆంజనేయ ఆటోస్టాండ్‌ను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా స్టాండ్‌లో ఆటోలను నిలపాలన్నారు. 15వ డివిజన్‌లోని ఆటోస్టాండ్‌ అంటే క్రమపద్దతిగా ఉంటారనే మంచిపేరు తీసుకురావాలని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చిన పరిష్కరించడానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌తో పాటుగా తాను కూడా అందుబాటులో ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో చెరుకూరి మురళీ, నందమూరి పూర్ణచంద్రరావు, పేరేపీ ఈశ్వర్, ఎర్రపోతుల సూర్యనారాయణ, దేవాపుత్ర సుబ్రమణ్యం, ఆటోస్టాండ్‌ సభ్యులు చలమల శెట్టి మురళీకృష్ణ, మల్ల నారాయణరావు, తానికారు శబరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *