తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ మరియు ప్లేస్మెంట్స్ పై మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ ఎస్ఎస్ఎస్డిసి, ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్లో హెల్త్ కేర్ సెక్టార్ నందు వివిధ దేశాల్లో ఉన్న నర్సింగ్ ఉద్యోగాల కొరకై రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకశాల పై, అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష పై ఆరు నెలల శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి కనీసం నెలకు 2.5లక్షల నుండి 3.5లక్షల రూపాయలు జీతంతో కుడినటువంటి ఉద్యోగా అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అతిధులుగా గంగాభవాని, ప్రిన్సిపాల్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీనివాస్ రీజినల్ చీఫ్ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, తిరుపతి ఎంప్లాయిమెంట్ బ్యూరో, ఆర్. లోకనాదం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, మురళి ఏడిఎస్డిఓ మరియు రాంజబి,usdo,తిరుపతి జిల్లా వారి సిబ్బంది మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News