Breaking News

ప్రతి శుక్రవారం జిఎంసిలో పట్టణ ప్రణాళిక ఓపెన్ ఫోరం… : కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక అంశాలపై అర్జీలు, ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని సిటి ప్లానర్ చాంబర్ లో ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నామని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆదేశాల మేరకు సిటి ప్లానర్ రాంబాబు ఓపెన్ ఫోరం నిర్వహించి, మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబందించిన సమస్యలపై ఫోరంలో అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ఫోరంలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబందించిన అధికారులు పాల్గొంటారన్నారు. కనుక నగర ప్రజలు, లైసెన్స్డ్ ఇంజినీర్లు, తమ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఫోరంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిసిపి సూరజ్ కుమార్, ఏసిపిలు రెహ్మాన్, వెంకటేశ్వర్లు, టిపిఎస్ సత్యనారాయణ, టిపిబిఓలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *