Breaking News

దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంద్రకీలాద్రి ఆలయ అభివృద్ధి పనులను చేపట్టాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్పులు చేసి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సుజనా చౌదరి నేతృత్వంలో తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు చర్చించిన సుజనా మరో సారి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించి సలహాలు సూచనలను అందించారు. భవిష్యత్తులో ఎదురయ్యే భక్తుల అవసరాలను పరిగణలోకి తీసుకొని మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జనవరి నాటికి మరింత మెరుగ్గా ప్లాన్ ను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సుజనా ఆదేశించారు.
కార్యక్రమంలో దుర్గగుడి ఈ ఈ వైకుంఠరావు, సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ బి పాండురంగారావు,స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ శ్రీనివాసరావు, సుజనా ఫౌండేషన్ ప్రతినిధి బోరా శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బెగ్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *