తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి 16.12.2024 సోమవారం నాడు తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో ఆదివాసి అభివృద్ధి సంస్థ మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా ముద్రించిన బాల్య వివాహల నిర్మూలన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులు, ఎన్ జి ఓ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెసి శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్య నారాయణ, ఆదివాసి అభివృద్ధి సంస్థ అధ్యక్షులు చందమామ కోటయ్య, పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పి అమర్నాథ్, హెల్పింగ్ హాండ్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎం దొరస్వామి, మనసంస్కృషి కళా సంస్థ కార్యదర్శి K. రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News