విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు బుధవారం నాడు సర్కిల్ 3 పరిధిలో ఉన్న కృష్ణ లంక పట్టణ సమాఖ్య సమావేశం కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. ముఖ్య అతిధి గా ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకట నారాయణ గాయూ హాజరు అయ్యి మెప్మా ప్రాజెక్ట్ లో జరుగుతున్న వివిధ రకాల ప్రభుత్వ పథకాలు ఐన SHG ప్రొఫైలింగ్, MSME, pm శ్వానిది, ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనా, వీధి వ్యాపారులకు లకు సోషియో ఎకనామిక్ సర్వే , కామన్ ఇంటరెస్ట్ గ్రూప్ లు , రేవాల్వింగ్ ఫండ్ మొదలైన విషయాలపై ఈ ఇయర్ లక్ష్యం, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పై రివ్యూ చేయడం జరిగేంది. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ యుసిడి విభాగం TE ఫణి కుమార్, CO లు, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్, rp లు, సమాఖ్య అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News