Breaking News

చలించిన బాబు… పెన్షన్ మంజూరు చర్యలకు కలెక్టర్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారి పల్లి నందు నేటి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఇంటి వద్దకు వస్తున్న సీఎం చంద్రబాబు వృద్ధ దంపతులను చూసి చలించిపోయి వారికి పెన్షన్ అందించేందుకు భరోసా ఇస్తూ మరోసారి మానవత్వం చాటుకున్నారు. సిఎం వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎక్కడి నుండి వచ్చారు…సమస్య ఏంటని అడిగారు. తన పేరు బి. నాగరాజమ్మ (సుమారు 62సం.) భర్త సుబ్బరామయ్య అని, భీమవరం గ్రామం చంద్రగిరి మండలం అని పక్షవాతంతో సుమారు 5 సం. నుండి బాధపడుతున్నానని, నడవలేక పోతున్నానని, దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలని విన్నవించుకోగా వెంటనే దివ్యాంగ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *