Breaking News

భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇస్రో ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఆలిండియా 9 ర్యాంకు సాధించి సైంటిస్ట్‌గా ఎంపికైన తెలుగు యువకుడు జడగం రమేష్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడును గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రమేష్‌ తండ్రి శ్రీనివాసులు డ్రైవర్‌గా, తల్లి రామలక్ష్మి టైలర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివించారని తెలుసుకున్న ముఖ్యమంత్రి వారిని అభినందించారు. చంద్రయాన్-3 ల్యాండర్ మిషన్ టీమ్‌లో ఒకరిగా పనిచేసిన రమేష్, భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *