Breaking News

ఘనంగా ఆచార్య యార్లగడ్డ విరచిత “సమరశీల ధీర వనిత కమలా హారిస్“ పుస్తకావిష్కరణ

-త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా నేడు లోక్ నాయక్ పురస్కారాలు

విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు, పద్మ భూషణ్ , ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విరచిత సమరశీల ధీర వనిత కమలా హారిస్ పుస్తకాన్ని విశాఖపట్నం లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాజీ మేయర్ రాజన రమణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ మహిళలు సమాజ పురోగతికి నిత్య నూతనంగా మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. “మహిళలు సమాజ పురోగతికి మూలస్తంభాలు. వారి శాంతియుత నిబద్ధత సమాజాలను పునరుత్థానపరుస్తుంది, ప్రపంచానికి శక్తివంతమైన ఆదర్శంగా నిలుస్తుంది,” అని ఆమె పేర్కొన్నారు. సమరశీల ధీర వనిత కమలా హారిస్ పుస్తకాన్ని తొలి కాపీని ప్రముఖ పారిశ్రామికవేత్త పోర్టు బ్రహ్మానందం స్వీకరించారు. ఆయన పుస్తకంలోని విషయాలను ప్రశంసిస్తూ, మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి, భవిష్యత్తు తరాల కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పుస్తక రచన ప్రేరణ గురించి వివరిస్తూ “కమలా హారిస్ ధైర్యం, నిర్ణయం, సమానత్వం కోసం నిబద్ధతను ప్రతిబింబిస్తారు,” అని అన్నారు. ఈ పుస్తకం కమలా హారిస్ యొక్క రాజకీయ జీవితాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మహిళల నాయకత్వం, వారి సాంఘిక పరివర్తన పై ఉన్న ప్రభావాన్ని చూడడానికి కూడా అవకాసం కల్పిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం మహిళల సాధికారత, సాంఘిక న్యాయం పై చర్చించే ఒక ఉత్తేజకరమైన వేదికగా నిలుస్తుందని వివరించారు,

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారాలు
పుస్తకావిష్కరణ అనంతరం ఆచార్య యార్లగడ్డ లోక్ నాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజ సేవా కార్యక్రమాల గురించి చెప్పారు. ఈ సంస్థ సాంఘిక న్యాయం కోసం పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రతి ఏడాది జనవరి 18న, ఫౌండేషన్ “ఎన్.టి. రామారావు” వారసత్వాన్ని గుర్తించి, వారి సాంఘిక న్యాయ పోరాటాన్ని పురస్కరించుకుని సమాజం లోని నాయకులను సత్కరిస్తోందన్నారు. ఎన్.టి. రామారావు నాయకత్వం మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని, లోక్ నాయక్ ఫౌండేషన్ ఈ వారసత్వాన్ని కొనసాగించడానికి కృషి చేస్తోందని వైఎల్ పి తెలిపారు. మరోవైపు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతాబ్దీ ఉత్సవాలు రేపు ముగియబోతున్నాయన్నారు. రాజన రమణి, పోర్టు బ్రహ్మానందం సైతం సాంఘిక మార్పు కోసం కృషి చేస్తున్న వారిని గుర్తించడంవల్ల సమాజంలో చైతన్యం పెరుగుతుందని తెలిపారు.
శనివారం సాయంత్రం 6గంటలకు ఆంధ్రా విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాల్‌లో నిర్వహించే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *