విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అబ్జర్వెన్స్ ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ లో భాగంగా పడవల రేవు సెంటర్లో రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన యన్.జి. ఓ. జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భముగా అబ్జర్వెన్స్ ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ లో భాగంగా రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన రోడ్డు సేఫ్టీ యన్.జి. ఓ. యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా యన్ . జి ఓ సంస్థ తరుపున తయారు చేసిన రోడ్డు భద్రతా ఆడియో ద్వారానే అవగాహన కార్యక్రమాలలో భాగంగానే హెల్మెట్ ధరించి వాహనం నడపాలి అని, సీట్ బెల్ట్ ధరించి వాహనం లో ప్రయాణము చేయాలి అని, అనేక రహదారి భద్రతా సూచనలు తో కూడిక ప్రచారం స్థానిక రామ లింగేశ్వర నగర్ పడవల రేవు సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కనక దుర్గ పద్మజ సభ్యులు బంగారయ్య కోటేశ్వర రావు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News