Breaking News

గ్లోరీ ఆఫ్ ది గ్రే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, 2025 జనవరి 26న, వాసవ్య మహిళా మండలి (VMM) మరియు విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA) సంయుక్తంగా గ్లోరీ ఆఫ్ ది గ్రే పేరుతో ఒక వైభవమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామ్మలు ర్యాంప్ వాక్ మరియు పాటలు తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పెద్దలు మరియు పిల్లల మధ్య తరాల అనుబంధాన్ని బలపరచడంతో పాటు వయసులో పెద్దవారి జ్ఞానం, సమర్థత, మరియు కాంతిని గౌరవించడం. ఈ కార్యక్రమానికి SPA విజయవాడ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ సరికొండ గారు ప్రధాన అతిథిగా హాజరయ్యారు. SPA అధ్యాపకులు, విద్యార్థులు, మరియు వాసవ్య మహిళా మండలి వాలంటీర్లు కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనవిజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *