Breaking News

38వ జాతీయస్థాయి క్రీడాపోటీల్లో ఏపీ క్రీడాకారిణి అత్యుత్త‌మ ప్రతిభ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ జాతీయస్థాయి క్రీడాపోటీల్లో ఏపీ క్రీడాకారిణి అత్యుత్త‌మ ప్రతిభకనబరచడం పట్ల శాప్ ఛైర్మన్ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరానికి చెందిన ఎస్.పల్లవి వెయిట్ లిఫ్టింగ్ 71కేజీల మహిళా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి పల్లవిని ఫోన్ ద్వారా శాప్ ఛైర్మన్ రవినాయుడు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారిణి పల్లవి విజయం రాష్ట్రప్రజలందరూ గర్వించదగ్గ విషయమన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *