Breaking News

జనవాణిలో మంత్రి కందుల దుర్గేష్ ప్రజల నుంచి నేరుగా అర్జీల స్వీకరణ

-నిడదవోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో పలువురి సమస్యలను స్వయంగా విన్న మంత్రి దుర్గేష్
-త్వరితగతిన సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ జనవాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. గంటల తరబడి ప్రజల సమస్యలను స్వయంగా విన్నారు. త్వరితగతిన సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. అండగా ఉంటామని భరోసానందించారు. తామున్నదే ప్రజలకు సేవ చేయడానికని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్పందన పట్ల వినతులు సమర్పించిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *