గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో త్రాగునీటిని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో త్రాగునీటిని అందించే అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే క్యాంటీన్ లో నీటి ట్యాంక్ ను కూడా ప్రతి 15 రోజులకు శుభ్రం చేయాలన్నారు. ప్రభుత్వ నిర్దేశిత సమయానుగుణంగా ఆహారం అందించాలన్నారు. క్యాంటీన్ల వద్ద లైట్లు, మొక్కలను ఏర్పాటు చేయాలని, ఏమైనా మరమత్తులు ఉంటే ఎప్పటికప్పుడు చేయాలని, క్యాంటీన్ల పరిశీలన నోడల్ అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News