-వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్పరిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని తెలిపారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనందరికీ ఆదర్శప్రాయుడని.. పుణ్య దంపతులు సీతారాముల కళ్యాణం ఈ లోకానికి పండుగ రోజని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీసీతారాముల ఆశీస్సులు నిండుగా లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News