Breaking News

చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి మరియు పిఎంకెఎంఫైన్ ఆర్ట్స్ , సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని ఈ పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు . తమ బృందంతో తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సుజనా చౌదరిని కలిసి చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సాంస్కృతిక , నృత్య, జానపద, కూచిపూడి, భరతనాట్యం, తదితర కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులను అంద చేస్తామని సినీ దర్శకులు వెంకటరమణ పసుపులేటి తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో డా. అశోక్ కొప్పుల, డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు,  కళా రత్న అవార్డు గ్రహీత దామోదర గణపతి. శొంఠి ఈశ్వరి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *