-ఎన్నికల అధికారి కె. జగదీశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 20వ తేదీన లబ్బీపేట లోని వెటర్నరీ హోమ్ లో నిర్వహించాల్సిన ఎపిఎల్ఎస్ఎ, ఎపిజెఓయస్ఎ, ఏపీవిఓఎస్ఎ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి కె. జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా యొక్క ధ్రువీకరణ ప్రతులు, మినిట్స్ పుస్తకం, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర పత్రాలను సంఘ నిర్వాహకులు నిర్ణీత వ్యవధిలో ఎన్నికల సంఘానికి సమర్పించనందున ఎన్నికలు వాయిదా వేయడానికి కారణమన్నారు. సంఘ నిర్వాహకులు ఎన్నికల సంఘం కోరిన పత్రాలను అందజేసిన తర్వాత కొత్త ఎన్నికల తేదీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా వేసిన అంశాన్ని సంఘం రాష్ట్ర నాయకులకు ఇప్పటికే తెలియజేశామని వివరించారు. ఎన్నికల అదికారుల గా నియమితులైన కె.జగదీశ్వరరావు ఎ. రంజిత్ కుమార్ నాయుడు డి.వేణుమాధవ్ లు సంయుక్తం గా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఓటు హక్కు ఉన్న సభ్యులు ఈ విషయాన్ని గమనించాలని జగదీశ్వర రావు ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News