-పాల్గొననున్న జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు ఏప్రియల్ 21 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పర్యటన కార్యక్రమం వివరములు… ఏప్రియల్ 21 వ తేదీ ఉదయం 10.00 గంటలకు పాలకొల్లు నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి ఉదయం 11.40 గంటలకు చేరుకుని ఆర్ అండ్ బి అతిథి గృహం బస చేస్తారు. అనంతరం స్థానిన శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులతో, కూటమి నేతలతో , పార్టీ జిల్లా ఇంచార్జీ లతో ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం లో పాల్గొంటారు. తదుపరి మ.3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక బొమ్మూరు లోని కలెక్టరేట్లో తూర్పు గోదావరి జిల్లా.. జిల్లా సమీక్షా (డీఆర్సీ) సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 వరకు రిజర్వు. అనంతరం రాత్రి 7.50 రాజమహేంద్రవరం నుంచి శ్రీకాకుళం రోడ్డు కు బయలుదేరి వెళ్లడం జరుగుతుంది.
Prajavartha Online Telugu News