Breaking News

పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు హేయమైన చర్య

-బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి సుభాష్

రామచంద్రపురం/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బైసరన్, పహల్గామ్ లో విహరిస్తున్న పర్యాటకులు, స్థానికులపై మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఖండించారు. ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిస్తున్నారని అన్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు విదేశీయులతో పాటు, 28 మంది అమాయకుల ప్రాణాలను బలిగొని, అనేక మందిని గాయపరిచిన సంఘటన అనాగరిక చర్యగా పేర్కొన్నారు. మానవత్వం, శాంతి, కాశ్మీర్ ఆతిథ్య స్ఫూర్తిపై దాడిగా ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మంత్రి సుభాష్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడినవారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. నాగరిక సమాజంలో ఇటువంటి హింసకు స్థానం లేదన్నారు. అత్యంత హేయమైన దాడికి పాల్పడిన నర హంతకులును న్యాయస్ధానం ముందుకు తీసుకురావాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, జమ్మూ కాశ్మీర్ ప్రజలతో సంఘీభావంగా భారత్ ఎల్లప్పుడూ ఐక్యంగా నిలుస్తుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *