-జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో డిపెన్స్ క్లస్టర్ హబ్
-రెండు వేల ఎకరాలు కేటాయించిన సీఎం చంద్రబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలల్లో ఢిపెన్స్ క్లస్టర్ ఏర్పాటు కోసం రెండు వేల ఎకరాలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబు కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎంపి కేశినేని శివనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
డిఫెన్స్ క్లస్టర్ హబ్ రావటం వల్ల ఎంతో మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యువతకి ఉద్యోగావకాశాలు కల్పించటం కోసం రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు తీసుకురావటానికి సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఔత్సాహిక ఎంటర్ ప్రెన్యూర్స్ కు డిఫెన్స్ పరిశ్రమ రంగంలో అడుగుపెట్టెందుకు చక్కని సదావకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్రం పారిశ్రామ రంగంలో మరో ముందడుగు వేయటానికి సీఎం చంద్రబాబు బాటలు వేశారని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజల తరుఫున, రాష్ట్ర ప్రజల తరుఫున సీఎం చంద్రబాబు కి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News