-మగ్గం నేసిన మంత్రి
-చేనేతకు మద్దతిచ్చిన మంత్రి
ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన నియోజకవర్గమైన ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పాదయాత్రలో భాగంగా ఈ రోజు 20వ వార్డును సందర్శించారు. పాదయాత్ర సమయంలో అక్కడి స్థానికులతో కలిసిమెలిసి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మవరం చేనేత సాంప్రదాయానికి తగిన గౌరవం తెలియజేస్తూ ఒక చేనేత మగ్గం వద్ద కూర్చొని స్వయంగా మగ్గం నేసారు. ఈ వినూత్న చర్య స్థానిక చేనేత కార్మికులకు ప్రేరణనిచ్చేలా, వారి వృత్తి పట్ల ప్రభుత్వ ప్రాధాన్యతను చాటేలా నిలిచింది. చేనేతల దుస్థితిని మేము అర్థం చేసుకుంటున్నాం. ధర్మవరం చేనేతను తిరిగి ప్రోత్సహించేందుకు మేము కట్టుబడి ఉన్నాం, అని మంత్రి అన్నారు.
Prajavartha Online Telugu News