Breaking News

విజయ కిలాద్రిపై మాజీ మంత్రి హరీష్ రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై అంగరంగ వైభవంగా జరుగుచున్న హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం విజయకిలాద్రిపై వేంచేసి ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి అభిషేక మహోత్సవం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎంతో వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విజయ కిలాద్రి దివ్య క్షేత్రం పైకి విచ్చేసి స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారు. కొండ పైన ఉన్నటువంటి అన్ని ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయ కీలాద్రి దివ్య క్షేత్ర హనుమత్ విజయ యాత్ర మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకిలాద్రి దివ్య క్షేత్రం వరకు ఎంతో వైభవంగా బైక్ మరియు కార్ ర్యాలీ ఎంతో కోలాహాలంగా, కన్నుల పండుగగా జరిగినది.. ఎంతోమంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *