Breaking News

యువతలో పారిశ్రామిక ఆలోచనలకు బాటలు

-ఆర్‌టీఐహెచ్‌లో ఐదు రోజుల శిక్షణా శిబిరం ముగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్), విజయవాడ–ఎనికేపాడు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 21 వరకు నిర్వహించిన ఐదు రోజుల పారిశ్రామికవేత్తల శిక్షణా శిబిరం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ శిక్షణా శిబిరంలో పీబీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులతో పాటు సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పారిశ్రామిక ఆలోచనా విధానం, సమస్యలను గుర్తించడం, వినూత్న పరిష్కారాలను రూపొందించడం, వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై వారికి అవగాహన, శిక్షణ అందించారు.
కార్యక్రమంలో భాగంగా 21 వినూత్న వ్యాపార ఆలోచనలను విద్యార్థులు నిపుణుల ముందు ప్రదర్శించారు. పౌర సేవలు, ప్రజా రవాణా, ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు, వ్యవసాయం తదితర రంగాలకు సంబంధించిన ఆలోచనలను విద్యార్థులు వివరించారు. నిపుణులు విద్యార్థులకు విలువైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు.
ఈ సందర్భంగా ఆర్‌టీఐహెచ్ విజయవాడ ముఖ్య కార్యనిర్వహణ అధికారి *డా. హరి బాబు* మాట్లాడుతూ యువతలో సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆర్‌టీఐహెచ్ అందిస్తున్న అవకాశాలను వివరించారు. వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చి భవిష్యత్‌లో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
ఐదు రోజుల శిక్షణా శిబిరం విద్యార్థులకు ఆవిష్కరణలు, పారిశ్రామిక ఆలోచనలు, శిక్షణ, మార్గదర్శకత్వానికి మంచి వేదికగా నిలిచింది. కార్యక్రమం విజయవంతం కావడంలో ఆర్‌టీఐహెచ్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *