గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మధ్యతరగతి ప్రజల కోసం చేపట్టిన ఇళ్ల స్థలాల లేఔట్ పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలంలోని వి. ఎన్ .పురం, పురుషోత్తపట్నం గ్రామాలలో మధ్య తరగతి ప్రజల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాల లేఔట్ పనులను శనివారం అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ లేఔట్ పనులను వెంటనే పూర్తి చేయాలనీ, లేఔట్ లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట నూజివీడు రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి, తహసీల్దార్ నరసింహారావు, ఇతర రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News