గన్నవరం , నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కి గన్నవరం ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికిన కలెక్టర్తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ శనివారం ఏపీలో మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్ ఆర్ ఎమ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అనంతరం శనివారం మధ్యాహ్నం రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్టు చేరుకున్నారు.కృష్ణజిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికారు.విమానాశ్రయ డైరెక్టర్ ఎం ఎల్ కె రెడ్డి, ప్రోటోకాల్ ఏడి విజయ్ కుమార్ వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.అనంతరం తెలంగాణ గవర్నర్ విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
Prajavartha Online Telugu News