విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్స్ స్టెల్లా కళాశాలలో ఇటర్మీడియట్ విద్యార్థులు కోసం కంప్యూటర్ కోర్సు లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నగరం లోని రైట్ కంప్యూటర్స్ వారు ఈ కోర్సు నీ నిర్వహించారు రైట్ కంప్యూటర్స్ సంస్థ డైరెక్టర్ సయ్యద్ బాషా గారు డిప్లొమా ఇన్ కంప్యూటర్ కోర్సు ఎమ్మెస్ ఆఫీస్ కాన్సెప్ట్స్ నీ నేర్పించారు. Dr రామకృష్ణ ఇంటర్మీడియేట్ వైస్ సెప్రిన్సిపల్ మాట్లాడుతూ స్టెల్లా కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు , నైపణ్యాభివృద్ధి కి కూడా కృషి చేస్తుందని,ప్రస్తుతం జాబ్ గ్గుమార్కెట్ సెక్టార్ లో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ కోర్స్ లు పై కనీస అవగాహన కలిగి వుండాలని లేదంటే ఉద్యోగావకాశాలు పొందలేరు అని,తమ కళాశాల ఇంటర్ నుండే విద్యతో పాటు నైపుణ్యాల లో విద్యార్థులను భాగస్వాములు గా చేయటం జరిగిందని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు సర్టిఫికేట్ మరియు మెమెంటో ను అందచేశారు. ఈ కార్యక్రమం లో కోర్స్ కంప్లీట్ చేసిన 150 మంది విద్యార్థినులు, ఇంటర్మీడియేట్ కోఆర్డినేటర్ స్వప్న ఉన్నాం, మరియు రైట్ కంప్యూటర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News