Breaking News

Tag Archives: amaravathi

తీవ్రవడగాల్పులు వీచే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం (21-04-26) 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం 54 తీవ్ర, 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే మండలాలు(46) శ్రీకాకుళం జిల్లా : ఆమదాలవలస,బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, లక్ష్మీనర్సుపేట, …

Read More »

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్ర‌గ‌తికి కీల‌కం

-నూత‌న జ‌నాభా నిర్వ‌హ‌ణ విధానంలో స‌మ‌గ్ర కార్యాచ‌రణ ప్ర‌తిపాద‌న‌ -నైపుణ్యావ‌స‌రాల గుర్తింపు, ల‌భ్య‌త‌లో వ్య‌త్యాసాల నిర్మూల‌న ల‌క్ష్యం -95 శాతం ప్ర‌జ‌లకు డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త -పారిశ్రామిక అవ‌స‌రాలకు అనుగుణంగా నైపుణ్య శిక్ష‌ణ‌ -అవ‌కాశాలను వినియోగించుకోవాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంతానోత్ప‌త్తి పెంపున‌కు ఆటంకంగా ఉన్న ఆర్థికప‌ర‌మైన స‌మ‌స్య‌ల్ని ప‌రిష్కరించే దిశ‌గా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఉత్పాద‌క సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విస్తృత నైపుణ్య వికాస ప్ర‌ణాళిక‌ను రూపొందించింద‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ …

Read More »

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..అర్జీలు స్వీకరించిన APCRDA కమిషనర్ వి.విజయరామరాజు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP), రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IASకి అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS అర్జీదారులకు తెలియజేశారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ …

Read More »

అమరావతి ప్రాంత యువతకు ఈ నెల 25న జాబ్ మేళా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి ప్రాంత యువత, నిరుద్యోగులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో మంత్రి డా.పొంగూరు నారాయణ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), CRDA సోషల్ డెవలప్మెంట్ అధికారుల సౌజన్యంతో అమరావతిలో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోంది. APSSDC సమన్వయంతో అమరావతి, తుళ్లూరులోని స్కిల్ హబ్ కార్యాలయంలో APCRDA అధికారులు జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం …

Read More »

76 ఏళ్ల వయసులో కూడా నిత్యవిద్యార్థి చంద్రబాబు

-ముందు చూపు కలిగిన గొప్ప పరిపాలనాదక్షుడు -సీఎం జన్మదిన వేడుకల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులో కూడా నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు ఆసక్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కొనియాడారు. అమరావతిలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను చైర్మన్ పట్టాభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ …

Read More »

పారదర్శకంగా ఉంటున్నాం… వ్రజలకు వాస్తవాలు తెలియచేద్దాం

-టీడీపీ ఇస్తోన్న శిక్షణా తరగతులతో లీడర్-కేడర్ మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ -పార్టీ ముఖ్యనేతల టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు -ఈ నెల 29వ తేదీన పార్టీ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సంక్షేమం, ప్రభుత్వ సేవలు, రాష్ట్రాభివృద్ధి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని…కానీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు తాజా రాజకీయ …

Read More »

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

-కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, అవడి, మధురైలలో 20, 21 తేదీల్లో సీఎం ఎన్నికల ప్రచారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్లనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున సీఎం ప్రచారం నిర్వహించనున్నారు. రేపు ఉదయం అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి… మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరులో నిర్వహించే ఎన్నికల …

Read More »

నెరవేరబోతున్న రైతన్నల దశాబ్దాల కల

-మంత్రి సత్యకుమార్ చొరవ, కృషితో వందలాది ఎకరాలకు అందనున్న సాగునీరు -కొండలను తొలచి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణం -అడ్డుగా ఉన్న కొండల తొలగింపుతొ ప్రతి చుక్క నీరు రైతుకే – మంత్రి సత్య కుమార్ యాదవ్ ముదిగుబ్బ, (శ్రీ సత్యసాయి జిల్లా) నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి హతో రైతన్నల దశాబ్దాల కల నెరవేరనుంది. ముదిగుబ్బ మండలం బూదనంపల్లి గ్రామంలోని బూదలమ్మ చెరువు నుండి చింతకుంట చెరువుకు ఆదివారం నిర్వహించిన …

Read More »

అన్న క్యాంటీన్‌లో ముఖ్యమంత్రి దంపతుల అల్పాహారం

-జన్మదినం సందర్భంగా పటమట అన్న క్యాంటీన్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సోమవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నగరంలోని పటమట అన్నక్యాంటీన్‌కు వెళ్లి అల్పాహారం తీసుకోనున్నారు. ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన సతీమని నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్‌ల ఒక రోజు ఖర్చు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో రేపు ఉచితంగా ఆహారం అందించనునన్నారు. రాష్ట్రంలో ఉన్న …

Read More »

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి, ఈ సందర్భంగా, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అయినటువంటి, I&PR, జాయింట్ డైరెక్టర్, పి.కిరణ్ కుమార్ ని, ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి, ఆచార్య జి. పి రాజశేఖర్, ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ఉప కులపతి I/c ఆచార్య డి. వి.ఆర్ మూర్తి, ఆంధ్రా యూనివర్సిటీ రెక్టర్, ఆచార్య పి. కింగ్, ఘనంగా దుశాలువాతో సత్కరించి, మెమెంటో అందించారు, ఈ కార్యక్రమం లో …

Read More »