Breaking News

Tag Archives: vijayawada

జూన్ 1న కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన : చామవరంలో భారీ ఏర్పాట్లు

-తుని నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం: ప్రజావేదిక ద్వారా ప్రజలతో నేరుగా మమేకం -ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సిద్ధం: తునిలో పండుగ వాతావరణం -భద్రత, సౌకర్యాలపై అధికారులతో సమీక్షించిన ఎంపీ సానా సతీష్ బాబు విజయవాడ/ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల జూన్ 1వ తేదీన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తుని మండలం చామవరం గ్రామంలో సీఎం పర్యటన కోసం యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా …

Read More »

విజయవాడ అంటేనే విద్యలవాడ… : ఎంపీ కేశినేని శివనాథ్

-ఎంటర్ప్రేన్యూర్ కాదు ఆంధ్రప్రెన్యూర్ రావాలనేది ముఖ్యమంత్రి ఆలోచన -ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు -త్వరలో ఏపీకి స్పోర్ట్స్ యూనివర్సిటీ -ఎడ్యుకేషనల్ ఎక్స్పో ను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని లబ్బీపేట ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ నందు టీవీ9 మరియు క్యాబ్ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఎక్స్పోను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఎంపీ చిన్నికి టీవీ9 మరియు క్యాబ్ ప్రతినిధులు …

Read More »

నగరంలో “రూట్స్ హెల్త్ సర్వీసెస్ 13వ వార్షిక అవార్డ్స్” టీజర్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డాక్టర్స్ డే సందర్బంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ జులై లో నిర్వహించే “రూట్స్ హెల్త్ సర్వీసెస్ 13వ వార్షిక అవార్డ్స్” కార్యక్రమంకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. శనివారం గురునానక్ కాలనీలోని ప్రైడ్ మాధవ హోటల్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్ ఎల్ వి. బిల్డర్స్ చైర్మన్ పి.శ్రీనివాస రాజు ఈ అవార్డ్స్ టీజర్ విడుదల చేసారు. ఈ సందర్బంగా అయన ప్రసంగిస్తూ డాక్టర్స్ ప్రజల ప్రాణాలు కాపాడే దేవుళ్ళు …

Read More »

సత్వర అనుమ‌తుల‌తోనే పారిశ్రమికాభివృద్ధి సాధ్యం

– పారిశ్రామిక స‌మ‌గ్రాభివృద్ధిలో జిల్లాను ఆద‌ర్శంగా నిలుపుదాం – ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త దిశ‌గా వ‌డివడిగా అడుగులేద్దాం – తాజాగా 26 క్లెయిమ్‌ల‌కు రూ. 3.48 కోట్ల ప్రోత్సాహ‌కాలకు ఆమోదం – డీఐఈపీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు స‌త్వ‌ర అనుమ‌తులు జారీచేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామ‌ని.. పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాను ఆద‌ర్శ‌వంతంగా నిల‌బెడ‌దామని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం కలెక్టర్ …

Read More »

56 మందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 56 మందికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు రూ 29 లక్షల 70 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా పశ్చిమలో పెద్ద ఎత్తున ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

-ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …

Read More »

మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్ భరోసా కల్పించాలి..

-రతన్ టాటా హబ్ (ఆర్‌టిహెచ్) ద్వారా శిక్షణ అందిస్తాం.. -ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకోవాలి.. -ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంలో భాగస్వాములుకండి.. -జిఎస్‌టి, ఎఫ్ఎస్‌టి రిజిస్ట్రేషన్ తప్పక పాటించాలి.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొదుపు సంఘాల మహిళలకు పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించి తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన రతన్ టాటా హబ్ (ఆర్‌టిహెచ్) పట్టణ స్వయం సహాయక సంఘం ( …

Read More »

వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విపత్తు నిర్వహణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (NDMEWS) జారీ చేసిన వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున శనివారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్ని శాఖాధిపతులు, జోనల్ కమిషనర్లు, వార్డు స్థాయి …

Read More »

ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో రెండో వారానికి శ్రీకారం

-కాలువలు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, బ్యాక్ లేన్ల డీ-సిల్టింగ్‌పై ప్రత్యేక దృష్టి -ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని ముంపు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా రెండో వారంలో చేపట్టతున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, ప్రధాన కాలువలు, అంతర్గత డ్రెయిన్లు, బ్యాక్ లేన్ల డీ-సిల్టింగ్ కార్యక్రమాలకు శనివారం ఎన్‌టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సమీపంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) …

Read More »

ఏపీటీడీసీ పురోభివృద్ధియే లక్ష్యం : చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ

​విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రగతి, రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా విజయవాడలోని బెరమ్ పార్క్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. APTDC చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ బలోపేతానికి, పర్యాటకులకు అందించే సేవల నాణ్యతను పెంచడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మెగా సమీక్షలో రాష్ట్రంలోని 7 డివిజన్ల డివిజనల్ మేనేజర్లు, 58 మంది యూనిట్ మేనేజర్లు మరియు ఇంజనీరింగ్ …

Read More »