Breaking News

Tag Archives: vijayawada

26న స్పందన… : క‌మిష‌న‌ర్‌ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ప్రతీ సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం మరియు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమమును పున:ప్రారంభించుట జరుగుతుందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటన ద్వారా తెలియజేసారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలకు మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌లో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకొనుటకు ది.26.07.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మద్యాహ్నం 1.00 గంట వరకు న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయంలో మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్ మరియు …

Read More »

29, 30, 31 వార్డు సచివాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే  మల్లాది విష్ణు…

-ఈబీసీ నేస్తం పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి… -మహిళ సంరక్షణ కార్యదర్శి సేవలను విస్తరించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సేవలు సులభమైన పద్దతిలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. మారుతీనగర్ లోని 29, 30, 31 వార్డు సచివాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  మాట్లాడుతూ గడపగడపకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించే ఉద్దేశంతో ఏర్పాటైన వార్డు సచివాలయ …

Read More »

క్రమశిక్షణతో చదివి ఉన్నతశిఖరాలను అధిరోహించాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జాం స్టేజ్ -2 ఫైనల్స్ ఫలితాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం మారుతీనగర్లోని శ్రీ చైతన్య స్కూల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా తో కలిసి  సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో …

Read More »

తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి ఆషాఢమాసం సందర్భంగా సారే సమర్పణ వేడుక గులాబీతోటలో వైభవంగా జరిగింది. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా సారెను సమర్పించారు. భక్తులు ఉత్సవ మూర్తికి పట్టుచీర, పసుపు-కుంకుమ, గాజులు, పూజా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ఉండాలని, వారు చేపట్టే మంచి పనులన్నింటిలో …

Read More »

పన్నులు వసూలు చేయడం మీద ఉన్న దృష్టి ప్రధాన రహదారులను బాగు చేయాలని లేదా… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ బంగారయ్య కొట్టు సెంటర్ వద్ద నుండి చిట్టి నగర్ వరకు, చిట్టినగర్ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు కెటి రోడ్డు ఇరువైపులా రోడ్డుపై పడ్డ గోతులను, రోడ్ల అధ్వాన్న స్థితితో, పాటు ప్రధాన కాలువలను పరిశీలించారు. వాహనదారులు పాదచారులు రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రధాన రహదారి గుండా ప్రయాణం …

Read More »

శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహలక్ష్మీ అమ్మ వార్ల దేవస్థానం లో శ్రీ మహలక్ష్మీ  అమ్మ వారికి శాకాంబరి దేవి అలంకారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహలక్ష్మీ  అమ్మ వార్ల దేవస్థానం లో శ్రీ మహలక్ష్మీ అమ్మ వారికి రెండవ రోజు శుక్రవారం శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు శుక్రవారం పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కమిటీ వారు అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి  మరుపిళ్ళ హనుమంతరావు, మరియు కోశాధికారి  పిళ్ళా శ్రీనివాసరావు (పిసి) భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కరోనా జాగ్రత్తలు భక్తులకు దర్శనం అందించారు. రేపు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులచే …

Read More »

కృష్ణాజిల్లాలో 98 గ్రామ, 16 వార్డు సచివాలయాలకు ఐఎస్‌ఓ గుర్తింపు…

-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను సచివాలయ ఉద్యోగులకు ప్రధానం – ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – ఉద్యోగులకు సర్టిఫికేట్లను అందచేసిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  పేర్ని వెంకట్రామయ్య (నాని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 98 గ్రామ, 16 వార్డు సచివాలయాలకు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ 9001 గుర్తింపు లభించింది. ఈ మేరకు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐఎస్‌ఓ గుర్తింపును సాధించిన సచివాలయాల ఉద్యోగులకు సర్టిఫికేట్ల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర …

Read More »

భారీ వర్షాలకు అధికార యంత్రాంగం ను అపప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఉత్తరువులు జారీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా జిల్లాలో రానున్న 5 రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితి నైనా ఎదురుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండేలా అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ జె. నివాస్ గురువారం ఉత్తరువులు జారీ చేసారు.  భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున అన్ని మండల తహసీల్దార్లు, పోలీస్, తదితర శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. . ప్రతీ …

Read More »

ఇళ్ల నిర్మాణాలతోపాటు ప్రతీ కాలనీలో మౌలిక సదుపాయాలు ముందుగానే కల్పిస్తున్నాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలతోపాటు ప్రతీ కాలనీలో మౌలిక సదుపాయాలు ముందుగానే కల్పిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు చెప్పారు. గురువారం నగరంలోని రైతు శిక్షణా కేంద్రంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షలమందికి ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. వీటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతీ జిల్లాలో పర్యటించి సమీక్షిస్తున్నామన్నారు. క్రొత్తగా 17 వేల కాలనీల్లో అండర్ గ్రౌండు వాటర్ , కరెంట్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ …

Read More »

ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణం అందించడంలో కృష్ణాజిల్లా ప్రధమం…

-జిల్లా కలెక్టరు జె.నివాసను ప్రత్యేకంగా అభినందించిన రాష్ట్ర మంత్రి శ్రీరంగనాధరాజు -11 వేల 419 మంది లబ్ధిదారులకు రూ. 56.10 కోట్లు అదనపు రుణం మంజూరు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘంలోని సభ్యుల ఇంటి నిర్మాణానికి అదనంగా రుణం మంజూరు చేసి అందించడంలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా ప్రధమస్థానంలో నిలిచిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు చెప్పారు. స్థానిక ఇరి గేషన్ కాంపౌండ్ లోని రైతు శిక్షణా కేంద్రంలో గురువారం 11 వేల 419 మంది లబ్దిదారులకు …

Read More »