Breaking News

జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో పనుల కలిసి పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని డొంక రోడ్ 3 వంతెనల వద్ద రైల్వే శాఖ చేపట్టిన నూతన ట్రాక్ ఎక్స్ టెన్షన్ పనులు ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేయాల్సిన్దేనని, ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  రైల్వే అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ 3 వంతెనల దగ్గర జరుగుతున్న పనులను రైల్వే, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతేడాది నవంబర్ 25 నుండి డొంక రోడ్ వద్ద 3 వంతెనల మార్గంలో రైల్వే శాఖ ట్రాక్ ఎక్స్ టెన్షన్ కోసం రాకపోకలు నిలుపుదల చేశామన్నారు. ఫలితంగా అరండల్ పేట, శ్రీనగర్, గుంటూరు వారితోట, డొంక రోడ్ తదితర ప్రాంతాల ప్రజలు కొత్తపేట, బస్టాండ్, ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరలో శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభం కానున్నందున పనులను ఫిబ్రవరి 10 నాటికి పనులు పూర్తి చేసేలా రైల్వే ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పనుల వేగవంతానికి రాత్రిపూట కూడా జరగడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అలాగే సదరు ప్రాంతంలో జిఎంసి త్రాగునీటి పైప్ లైన్ షిఫ్ట్, డ్రైన్ పనులను కూడా చేపట్టుట జరిగిందన్నారు. రైల్వే శాఖ చేపడుతున్న పనులకు జియంసి ఇంజనీరింగ్ అధికారులు కూడా సమన్వయం చేసుకోవాలని, పనులు పూర్తయ్యే వరకు ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించాలని యస్.ఈ ని ఆదేశించారు.
పర్యటనలో రైల్వే డిప్యూటి చీఫ్ ఇంజనీర్ నోయల్, జిఎంసి యస్.ఈ నాగమల్లెశ్వర రావు, ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ కళ్యాణరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాంస్కతిక వారసత్వాలకు చిహ్నంగా ‘లేపాక్షి’

-సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా నిర్మాణాలు -రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షో రూమ్ ల్లోనూ మరమ్మతులు -ఎస్పీఏవీతో ఏపీహెచ్డీసీ ఒప్పందం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *