గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం అభ్యర్డుల సమక్షంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీమతి వి. కరుణ , రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ చేపట్టడం జరిగింది. ఈ నామినేషన్ల పరిశీలనలో 30 మంది అభ్యర్డుల నామినేషన్లను అంగీకరించడం జరిగింది. పది మంది అభ్యర్డుల నామినేషన్లను తిరస్కరించడం జరిగింది. ఇందుకు సంబంధించి వ్యాలిడ్ నామినేటెడ్ క్యాండిడేట్స్ జాబిత జతపరచడం జరిగింది.
నామినేషన్ల పరిశీలనా కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు డిఆర్ఓ షేక్. ఖాజావలి , డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, కలక్టరేట్ ఎన్నికల విభాగ సిబ్బంది , అభ్యర్డులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News