Breaking News

ప్రశాంతంగా ఈడిఎం పోస్టు రాత పరీక్ష

-హాజరైన 93 మంది అభ్యర్థులు
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ కి చెందిన ఈ-గవర్నెన్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఈ డి ఎం ) కాంట్రాక్టు పోస్ట్ భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షకు 93 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలియ చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ డి ఎం రాత పరీక్ష ను పరిపాలన అధికారి ఎండీ ఆలీ, సెక్షన్ సూపరింటెండెంట్ మహేశ్వరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, పొరుగుసేవల కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ డి ఎం పోస్టు కోసం 115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 93 మంది (81 శాతం) హాజరు కాగా, 22 మంది అభ్యర్థులు హాజరుకాలేదని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *