విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు స్లిప్పులను భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో కూటమి నేతలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎవరికైనా ఓటర్ స్లిప్పు అందకపోయినా జాబితాలో పేరు ఉన్నట్టయితే గుర్తింపు కార్డుతో ఓటు వేయచ్చని కూటమినేతలు సూచించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి నేతలందరూ సమిష్టిగా కృషి చేస్తున్నామని ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి కొరకై భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో సంప్రదించాలని మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తెలిపారు.
Prajavartha Online Telugu News