విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెంజ్ సర్కిల్ నారాయణ జూనియర్ కాలేజీ ఆవరణలో నారాయణ విద్యాసంస్థల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పాల్గొని ప్రశంగించారు. గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అధ్యాపకులు దాచుకున్న డబ్బులు కాజేసి, వారి బకాయిలు నిలిపివేసి వారిని ఇబ్బందులు పెట్టారన్నారు. ఆలపాటి రాజా లాయర్ గా, విద్యార్థి నాయకుడిగా, మంత్రిగా ఉన్నత స్థానానికి చేరారు. సభలో తన వాణి ఇనిపిస్తారు, cm, పవన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కి చెప్పి పట్టభద్రుల సమస్యలు తీర్చగలరని తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఓటు వేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, పట్టభద్రుల సమస్యలు పరిస్కారం కోసం పనిచేస్తానని తనకు చక్కటి మెజార్టీ అందించాలని కోరారు. పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ శాసన మండలిలో విద్యావంతులు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకులు ఆలపాటి రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్, చెన్నూపాటి గాంధీ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News