తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32,344 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 15 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 31,851 మంది, ఒకేషనల్లో 1,313 మంది మొత్తం 33,164 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా జనరల్లో 720, ఒకేషనల్లో 100 మంది, మొత్తం 820 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …
Prajavartha Online Telugu News