రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లా పర్యటన నిమిత్తం నేటి బుధవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గౌ. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ గారికి సాదర స్వాగతం లభించింది. కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఇమ్రాన్, పిసి రాయుడు తదితరులు కేంద్ర సహాయ మంత్రికి సాదర స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి రోడ్డు మార్గాన కడపకు బయలుదేరి వెళ్లారు. రేపు …
Read More »Monthly Archives: January 2025
జనవరి 1 నుండి పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ల స్వీకరణ : జిల్లా ఖజానా అధికారి లక్ష్మీకర్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లను జనవరి ఒకటో తేదీ నుండి ట్రెజరీ కార్యాలయంలో స్వీకరిస్తామని జిల్లా ఖజానా అధికారి లక్ష్మీకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ దారులు ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నుండి ఫిబ్రవరి నెల ఆఖరు వరకు లైఫ్ సర్టిఫికెట్ డిజిటల్ పద్ధతిలో జీవన్ ప్రమాణ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు అని, అందుకొరకు ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నంబరు, …
Read More »జిల్లా రెడ్క్రాస్ ఛైర్మన్గా జాస్తి సత్యనారాయణ చౌదరి
-నూతన కమిటీకి రెడ్క్రాస్ అధ్యక్షులు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఛైర్మన్గా జాస్తి సత్యనారాయణ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాఖ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 31వ తేదీన రెడ్క్రాస్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో జిల్లా రెడ్క్రాస్ మేనేజింగ్ కమిటీకి పదిమంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు తెలిపింది. జాస్తి సత్యనారాయణ చౌదరి, డా. వి.నారాయణరావు, కొల్లి …
Read More »అమరావతి అక్యుపంక్చర్ హబ్ ఏర్పాటుకు కృషి… : డా. మాకాల సత్యనారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ఆక్యుపంక్చర్ హబ్ గా అభివృద్ధి చేసి భారతదేశంలోనే మొట్టమొదటి కేంద్రంగా వుండేలాగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి విన్నపాన్ని అందించనున్నట్లు ఎస్పా భారత్ (ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోషియేషన్ ఆప్ భారత్) వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శి డా.మాకాల సత్యనారాయణ కోరుతున్నామని తెలిపారు. ఇలా చేస్తే భారత సాంప్రదాయ వైద్యం మరింత ప్రజలకు అందుబాటులోనికి వస్తుందని తెలిపారు. మందులు అవసరం లేని, ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ …
Read More »ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ కార్యాలయం ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు
-వైసీపీ శ్రేణులతో కోలాహలంగా మారీన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మరియు విజవాడ నగరం నుండి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు,శ్రేయోభిలాషులు దేవినేని అవినాష్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్శకులతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అభిమానంతో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు. మీ ప్రేమాభిమానాలు మా పై ఎల్లప్పుడూ …
Read More »నేటి నుంచి 35వ పుస్తక మహోత్సవ మహా యజ్ఞం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుస్తక ప్రియులు, విజ్ఞాన సముపార్జకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న పుస్తకాల పండుగ ప్రారంభమైంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గత మూడున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా నూతన వత్సరం అక్షర శ్రీకారంతో ప్రారంభించే పుస్తక మహోత్సవ మహా యజ్ఞం ఈనెల 2వ తేదీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమవుతుందని బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి టి మనోహర్ నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం మహోత్సవ ప్రారంభంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2వ నుంచి …
Read More »ఈనెల 3 న జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ లోని మాజీ సైనిక సంఘ నాయకులoదరూ కలిసి ఒక తాటిపై వచ్చి, మన సమస్యలు పరిష్కరించడం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ రూపొందించడం కోసం ఈనెల జనవరి 03 తారీఖున 10 గంటలకు రిలయన్స్ ట్రెండ్ పైన ఉన్న హాల్లో, మణిపాల్ హాస్పిటల్ దగ్గర, విజయవాడ. రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పాటు చేయడం కోసం నిశ్చయించారు.కాబట్టి మాజీ సైనికుల …
Read More »సీఎం చంద్రబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఎన్జీవో నేతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీవో నూతన నాయకత్వం ఏపీ ఎన్జీవో నేతలు బుధవారం ముఖ్యమంత్రి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో విజన్ ఉన్న సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఇస్తారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని ఆశలను నింపిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు …
Read More »
Prajavartha Online Telugu News