రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
కడప జిల్లా పర్యటన నిమిత్తం నేటి బుధవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గౌ. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ గారికి సాదర స్వాగతం లభించింది. కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఇమ్రాన్, పిసి రాయుడు తదితరులు కేంద్ర సహాయ మంత్రికి సాదర స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి రోడ్డు మార్గాన కడపకు బయలుదేరి వెళ్లారు. రేపు కడప జిల్లా కార్యక్రమాలలో పాల్గొని మూడవ తేదీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.
Prajavartha Online Telugu News