Breaking News

Monthly Archives: January 2025

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం …

Read More »

పేదలకు ఇళ్ల స్థలాలు, విద్యుత్‌ చార్జీల పెంపు తదితర ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిపిఐ సన్నద్ధం

-పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయాలి. -ఆదానీతో జరిగిన అన్ని ఒప్పందాలు రద్దు చేయాలి. -పెంచిన విద్యుత్‌ చార్జీల భారాలు ప్రభుత్వమే భరించాలి. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -సమావేశంలో మూడు తీర్మానాల ఆమోదం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ల స్థలాల సమస్యలపైన, విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాల్లో పేద ప్రజలను భాగస్వాములను చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ

-ఈ సోమవారం (20-1-2025) నుండి ప్రజాఫిర్యాదుల స్వీకరణ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో అమలు -జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి యస్. ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల …

Read More »

ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజ నిర్మాణం

-కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంది -ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది -ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలుస్తారు. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మగౌరవం, పేదవారి గుండెల్లో చెరగని జ్ఞాపకం, బడుగువర్గాల ధైర్యం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజాన్ని …

Read More »

ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘బ్రాండ్ ఎపి’కి ప్రమోషన్

-రేపు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు -WEF లో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సిఎం చంద్రబాబు సమావేశాలు -కొత్త పాలసీలు, రాష్ట్ర అనుకూలతలు వివరించి పెట్టుబడిదారులకు ఆహ్వానం -ఆదివారం రాత్రి 1.30 గంటకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు ముఖ్యమంత్రి బృందం -నాలుగు రోజుల పర్యటనలో WEF సెషన్స్ లో, చర్చా కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాండ్ ఎపి ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగే వరల్డ్ …

Read More »

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను తొలగించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి.. -నూజివీడు పట్టణం లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పార్ధసారధి.. ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత అనేది మన జీవితంలో భాగం కావాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పిలుపునిచ్చారు. శనివారం నూజివీడు పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి …

Read More »

ఎన్.టి.ఆర్. జీవితం ఆదర్శనీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నటుడుగా ఆయన స్ఫురణకు వస్తే ఆయన అభినయించిన పాత్రలే కళ్ల ముందు మెదులుతాయి. రాజకీయ నేతగా తలంపుకొస్తే ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయి. అంతటి బలీయమైన ముద్ర వేసిన  నందమూరి తారక రామారావు తెలుగు వారైనందుకు తెలుగువారందరికీ గర్వకారణం. ఆ మహాపురుషుడు వర్థంతి సందర్భంగా నీరాజనాలు అర్పిస్తున్నాను. ఆయన నట జీవితం, రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం… ఆచరణీయం అని ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

Read More »

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకి సాదర స్వాగతం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం విజయవాడకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షాతో చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమిత్ షాకు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. విందుకు పురందేశ్వరి, పలువురు కూటమి నేతలు హాజరయ్యారు. విందు అనంతరం …

Read More »

పత్రి ఒక్కరిలో స్వచ్ఛతపై అవగాహన కలిగించాలి..

-స్వచ్ఛత-శుభ్రత ప్రజల జీవన విధానం కావాలి.. -నూజివీడు మండలం తుక్కులూరులోసామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పార్ధసారధి.. ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. శనివారం నూజివీడు మండలం తుక్కులూరులో నిర్వహించిన స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి పాల్గొన్నారు. ఈ సందర్బంగా తుక్కులూరు కూడల్లో మానవహారంగా ఏర్పాడి అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి …

Read More »

క్యాన్సర్ పై ప్రచార భేరి

-ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ కు సిద్ధమైన సర్కారు -దాదాపు 50 వేల మందికిపైగా అనుమానిత క్యాన్సర్ బాధితుల గుర్తింపు -రోగులకు ప్రభుత్వాస్పత్రులలో ఉచిత చికిత్సకు ఏర్పాట్లు -క్యాన్సర్ నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతేడాది నవంబర్ 14 నుండి ప్రారంభమైన స్క్రీనింగ్ పది …

Read More »