Breaking News

Daily Archives: May 15, 2026

రోడ్డు విస్తరణ పనుల వేగవంతంపై ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణకు స్తలాలు ఇచ్చే స్తల యజమానుల నుండి స్వచ్చంద అనుమతి పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల వేగవంతంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ నుండి హనుమయ్య కంపెనీ వరకు విస్తరణ …

Read More »

భవిష్యత్తులో నీటి కొరత రాకుండా కృష్ణ నదిపై చెక్కు డ్యామ్ లు నిర్మించాలి

-రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) జాతీయ కార్యదర్శిపేరం శివ నాగేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తులో నీటి కొరత లేకుండా కృష్ణా నదిపై చెక్కు డ్యామ్ లు నిర్మించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు తెలిపారు శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలుత సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన ఫోటో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ 1946లో ప్రకాశం బ్యారేజీ …

Read More »

వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంపులు విజయవంతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP): రాష్ట్రవ్యాప్తంగా 2026 సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్న వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంపులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1,387 కోచింగ్ క్యాంపులు నిర్వహించబడగా, 43,636 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. క్రీడాకారులకు అవసరమైన క్రీడా సామగ్రితో పాటు పోషకాహార డైట్ అందించబడుతున్నది. డైట్లో భాగంగా చిక్కీ మరియు ఇతర పోషకాహార పదార్థాలు పంపిణీ చేయబడుతున్నాయి. క్రీడాకారులకు అందజేస్తున్న చిక్కీలు మరియు ఇతర ఆహార పదార్థాలు సంబంధిత నాణ్యత …

Read More »

ఆతిథ్య రంగానికి ఊరటనివ్వండి: కమర్షియల్ ఎల్పీజీపై జీఎస్టీని తగ్గించాలని ఏపీ ఛాంబర్స్ విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆతిథ్య రంగానికి (హాస్పిటాలిటీ సెక్టార్) ఊరటనిచ్చేలా వాణిజ్య వంటగ్యాస్ (కమర్షియల్ ఎల్పీజీ) సిలిండర్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు నిరంతరంగా, విపరీతంగా పెరుగుతుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ (MSME) సంస్థలు …

Read More »

మిషన్ వాత్సల్య స్కీమ్ పై సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అమలచేస్తున్న మిషన్ వాత్సల్య స్కీమ్ పై జాయింట్ కలెక్టర్ శ్రీమతి యస్ ఇలాక్కియా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారి శ్రీమతి షేక్ రుక్సానా సుల్తాన బేగం జిల్లాలో మిషన్ వాత్సల్య స్కీం అమలుచేస్తున్న కార్యక్రమాలు గురించి వివరించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి యమ్ రాజేశ్వరరావు 2025-26 సంవత్సరంలో నిర్వహించిన స్కీం కార్యక్రమాలను పవర్ …

Read More »

రక్తదానం అన్ని దానాలకంటే గొప్పది : సీఎం ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్‌టీఆర్ జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్న స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్‌టీఆర్ జిల్లా కమిటీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయని ప్రశంసించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ జిల్లా కమిటీ ప్రత్యేక గుర్తింపు పొందుతోందన్నారు. కమిటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను చూసి ప్రభావితుడినై తాను స్వచ్ఛందంగా …

Read More »

టిడ్కో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయండి

– జ‌క్కంపూడి టిడ్కో ఇళ్ల నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ శుక్ర‌వారం జక్కంపూడి టిడ్కో గృహ నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికుల సంఖ్య, నిర్మాణ పనుల పురోగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (డ‌బ్ల్యూటీపీ) ప్రాంతాన్ని కూడా సందర్శించి జరుగుతున్న …

Read More »

జలవనరుల ఆక్రమణలకు చెక్..!

– విస్తృత ప్రజా ప్రయోజనాలకే పెద్ద‌పీట‌ – స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌కు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జల వనరుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కాలువలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులపై ఆక్రమణలను గుర్తించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని.. అత్యంత పార‌ద‌ర్శ‌క‌త‌తో నిర్వ‌హించే క్షేత్ర‌స్థాయి త‌నిఖీలు, ప‌రిశీల‌న‌ల నివేదిక‌లు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌కు కీల‌క‌మ‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు. జ‌ల వ‌న‌రుల సంర‌క్ష‌ణ‌, ఆక్ర‌మ‌ణ‌ల గుర్తింపు, తొల‌గింపున‌కు సంబంధించి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో …

Read More »

“బడి పిలుస్తోంది”… విద్యా వెలుగుల చైతన్య రథయాత్ర

-ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థుల అడుగులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా విజయవాడ నియోజకవర్గంలో చైతన్య విద్యా రథయాత్రను ఘనంగా పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రభుత్వ విద్యపై అవగాహన పెంపొందించి, ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో ప్రవేశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టబడింది. ఉదయం 8 గంటలకు జీఎన్ఆర్ హైస్కూల్ నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్, డీఎస్‌ఎం హై స్కూల్, భవానిపురం, ఎస్ ఎం ఏకే హైస్కూల్, స్వాతి సెంటర్, …

Read More »

జూలై 2026 లో జరిగే ‘ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్’ (AITT) పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం…

-ఉపాధి మరియు శిక్షణ శాఖ సంచాలకులు జి. గణేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జూలై 2026లో జరగనున్న ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) పరీక్షలకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ శాఖ సంచాలకులు జి. గణేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) పరిధిలోని క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (CTS) కింద, జూలై 2026 యాన్యువల్ సిస్టమ్ ద్వారా నిర్వహించే ఆల్ …

Read More »