-పర్యటనను ఘన విజయం చేసే బాధ్యతను ప్రతి కార్యకర్త తీసుకోవాలి అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాడుగుల పర్యటన ఘన విజయం చేసేలా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలంలో జోనల్ పరిశీలకులు బెందాళం అశోక్, జిల్లా పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి గారితో కలిసి కార్యకర్తలతో సమీక్షా సమావేశం …
Read More »Daily Archives: August 21, 2026
నీకు సీబీఐపై నమ్మకం ఉందా..?
-జగన్ పై మంత్రి సవిత నిలదీత -ఆనాడు వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు ఎందుకు వద్దన్నావ్..? -చెల్లెలు సునీత డిమాండ్ ను కూడా పట్టించుకోలేదు కదా… -నీతీరు దొంగే దొంగ అన్నట్లుంది… -గ్రూప్ 1 మూల్యాంకనం అక్రమాలు బయటపడడంతో డైవర్షన్ రాజకీయాలు -అసెంబ్లీలో చర్చకు ఎందుకు రాలేదు…? -మెగా డీఎస్సీ అభ్యర్థుల కష్టాన్ని తక్కువ చూసి చూడొద్దు -జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ బెదిరిపోరు -రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ : మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »రూ.221.67 కోట్ల వ్యయంతో ఆసుపత్రులు, కళాశాలల భవన నిర్మాణాలకు శ్రీకారం
-12 చోట్ల పనుల ప్రారంభానికి టెండర్ల ప్రక్రియ ప్రారoభం -ఇందులో 6 ఆయుష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, రెండు వైద్య కళాశాలలు -మంత్రి సత్యకుమార్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయుష్ వైద్య సేవలు, వైద్య విద్యకు అవసరమైన భవనాల నిర్మాణంతో పాటు అల్లోపతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనపు వసతుల కల్పనకు మొత్తం రూ.221.67 కోట్ల అంచనా వ్యయంతో 12 పనులకు టెండర్లను పిలిచినట్లు రాష్ట్ర …
Read More »డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
-ఏళ్ల నిరీక్షణకు తెర.. కాంట్రాక్ట్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం -క్రమబద్ధీకరణకు విశేష కృషి చేసిన NGO రాష్ట్ర నాయకత్వానికి సన్మానం -ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల హృదయపూర్వక కృతజ్ఞతలు -ఎన్జీవో రాష్ట్ర నాయకత్వానికి, ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) ప్రక్రియ విజయవంతం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేందుకు అలుపెరగని కృషి చేసిన …
Read More »మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘రైజ్’ కార్యక్రమం చుక్కానిలా నిలుస్తుంది
-శిక్షణలో పొందిన నైపుణ్యాలను ఉపాధి, స్వయం ఉపాధిగా మలుచుకోవాలి -మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారు చేసి, వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు ‘రైజ్’ కార్యక్రమం చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు . ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైజ్ కేంద్రంలో నిర్వహించిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను …
Read More »యువతలో పారిశ్రామిక ఆలోచనలకు బాటలు
-ఆర్టీఐహెచ్లో ఐదు రోజుల శిక్షణా శిబిరం ముగింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), విజయవాడ–ఎనికేపాడు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 21 వరకు నిర్వహించిన ఐదు రోజుల పారిశ్రామికవేత్తల శిక్షణా శిబిరం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరంలో పీబీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులతో పాటు సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పారిశ్రామిక ఆలోచనా విధానం, సమస్యలను గుర్తించడం, వినూత్న …
Read More »రోడ్డు భద్రతలో ఆదర్శ పట్టణంగా విజయవాడను నిలబెడదాం
-ఐడియల్ టౌన్ ఆన్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్టుతో లక్ష్యాలను చేరుకుందాం -ప్రమాద మరణాలు, క్షతగాత్రులను 10–15 శాతం తగ్గించడమే లక్ష్యంగా చర్యలు -నాలుగు కీలక అంశాలతో సమగ్ర రోడ్డు భద్రత కార్యాచరణ -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు భద్రతలో విజయవాడను ఆదర్శ పట్టణంగా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని.. అదేవిధంగా లక్ష్యాల సాధనకు ఐడియల్ టౌన్ ఆన్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. విజయవాడను రోడ్డు భద్రతలో …
Read More »తొలిరోజు ప్రశాతంగా సివిల్స్ మెయిన్స్..
– పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు శుక్రవారం విజయవాడ కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్నిజిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తనిఖీ చేశారు. తొలిరోజు పేపర్-1 ఎస్సే పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, …
Read More »దోమల నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని నగరపాలక సంస్థ బయాలజీ సూర్యకుమార్ నాయక్ అన్నారు . కమిషనర్ ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్చార్జి గోపాల నాయక్ సూచనలతో బయాలజిస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతినగర్లో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు. నీటి నిల్వల్లో దోమల లార్వా కనిపించిన ప్రాంతాల్లో వెంటనే లార్వా …
Read More »శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ను సద్వినియోగం చేసుకోవాలి… : తూర్పు ఈఆర్ఓ, కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 22, 23 మరియు 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రత్యేక క్యాంపెయిన్ డేస్లో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ముసాయిదా ఓటర్ జాబితాతో పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల …
Read More »
Prajavartha Online Telugu News