విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గాంధీనగర్ లోని ఎస్ కే సి వి ట్రస్ట్ ఆధ్వర్యంలోని విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. అలాగే చదువులో ప్రతిభను కనబరిచిన 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున మొత్తంగా 10,000 రూపాయల నగదుపురస్కారాలను అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి పేరిట కేక్ ని కట్ చేసి పంపిణీ చేశారు. ఇక్కడి కార్యక్రమంలో చిరంజీవి …
Read More »Daily Archives: August 22, 2026
డుచెన్ వ్యాధిపై అవగాహనా కార్యక్రమం!
– సెప్టెంబర్ 7న వరల్డ్ డుచెన్ అవేర్నెస్ డే సందర్భంగా నిర్వహణ – అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) అరుదైన జన్యుపరమైన వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 7న వరల్డ్ డుచెన్ అవేర్నెస్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహాయసహకారాలు అందించాలని అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శోభారాణి సుంకర జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను కోరారు. ఈ …
Read More »సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం
– వివాదాలకు సామరస్య పూర్వక పరిష్కారం – ఈ విషయంలో జిల్లాను ఆదర్శంగా నిలబెడదాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివాదాలకు సత్వర, సామరస్యపూర్వక పరిష్కారం చూపడంలో మధ్యవర్తిత్వం కీలకపాత్ర పోషిస్తుందని.. మీడియేషన్తో పాటు న్యాయ సేవల విషయంలో జిల్లాను ఆదర్శవంతంగా నిలబెట్టడంలో సమష్టిగా కృషిచేద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శనివారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మీడియేషన్పై మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ …
Read More »వన్ డే ఓపెన్ చెస్ టోర్నమెంట్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో పాఠశాల స్థాయి బాలబాలికల కోసం వన్ డే ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ చెస్ టోర్నమెంట్ 23.08.2026 ఆదివారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనదలచిన బాలబాలికలు ఉదయం …
Read More »సర్ నోటీసులకు కంగారుపడొద్దు..
– అత్యంత పారదర్శక విచారణతో పరిష్కారం – ఓటుహక్కు పరిరక్షణ కోసమే సమగ్ర ప్రక్రియ – దోష రహిత ఓటర్ల జాబితా రూపకల్పనలో ప్రతిఒక్కరూ భాగస్వాములుకండి – రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా జారీచేస్తున్న నోటీసులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి నోటీసుకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, విచారించి, అర్హత ఉన్న ప్రతి ఓటరు జాబితాలో …
Read More »పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత – తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్–1 పరిధిలో కలర హాస్పిటల్ వద్ద, సర్కిల్–2 పరిధిలో అక్టప్ స్కూల్లో, సర్కిల్–3 పరిధిలో పటమటలోని గోవిందరాజుల స్కూల్లో కార్యక్రమాలు నిర్వహించారు. పటమటలోని గోవిందరాజుల స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి విజయవాడ తూర్పు …
Read More »స్పెషల్ క్యాంపెయిన్ డేస్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: ఎన్నికల రోల్ పరిశీలకులు కూర్మనాథ్
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో జరుగుతున్న స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో ప్రజల నుండి అందే ఫారాలను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎన్నికల రోల్ పరిశీలకులు కూర్మనాథ్ స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఉమెన్స్ కాలేజీ, టిజెపిఎస్ కాలేజీల్లోని పోలింగ్ కేంద్రాలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోల్ పరిశీలకులు …
Read More »గుంటూరు నగరాన్ని స్వచ్చ గుంటూరు గా తీర్చిదిద్దుతాం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భాగస్వామ్యంతో గుంటూరు నగరాన్ని స్వచ్చ గుంటూరు గా తీర్చిదిద్దుతామని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని శుభ్రం చేసి, మొక్కలు నాటి తదుపరి ఉద్యోగులతో స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరాన్ని స్వచ్చ, గ్రీన్ నగరంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు …
Read More »స్వచ్ఛతకు ప్రతి అడుగు.. ఆరోగ్యాంధ్రకు ముందడుగు
– సమష్టి భాగస్వామ్యమే స్వచ్ఛాంధ్రకు బలమైన పునాది – ప్రతిఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు దూరంగా ఉండాలి – పరిశుభ్రమైన పరిసరాలతోనే మన ఆరోగ్యకరమైన భవిష్యత్తు – స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామగ్రామాన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా నిర్వహిస్తున్నామని.. ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని, మనం స్వచ్ఛతవైపు వేసే ప్రతి అడుగు ఆరోగ్యాంధ్రకు ముందడుగు అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శనివారం జి.కొండూరులోని కమ్యూనిటీ హాల్ …
Read More »కళాత్మకంగా స్వయం ఉపాధి..
– సృజనాత్మకతకు శిక్షణతో మహిళలకు ప్రోత్సాహం – ఎకో క్రాఫ్ట్స్, ఫైన్ ఆర్ట్స్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు తమలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని స్వయం ఉపాధి అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్వయం సహాయక సంఘాల మహిళలకు సూచించారు. శనివారం ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి రైజ్ కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎకో క్రాఫ్ట్స్, ఫైన్ ఆర్ట్స్పై వర్క్షాప్ జరిగింది. నారీ వస్త్ర …
Read More »
Prajavartha Online Telugu News