Breaking News

కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్లకు వేసిన తాళాలు, సీళ్ళు పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూరిటీ, సీసీ కెమెరాలు పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలన్నారు. తనిఖీ రిజిస్టరులో సంతకం చేసారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నెలవారి తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసి నివేదిక పంపవలసి ఉంటుంది. ఈ మేరకు కలెక్టర్ ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *